మూడేళ్ల చిన్నారిని లోప‌ల మ‌రిచి.. అంగ‌న్‌వాడీకి తాళం వేసి..

సంగారెడ్డి (CLiC2NEWS): ఓ అంగ‌న్‌వాడీ కేంద్రంలో మూడేళ్ల చిన్నారిని మ‌రిచిపోయి తాళం వేసి వెళిపోయారు. ఆ చిన్నారి ఏడ్చి ఏడ్చి సృహ కోల్పోయింది. ఈ ఘ‌ట‌న సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండ‌లం, ఖాజీప‌ల్లి అంగ‌న్‌వాడీ కేంద్రంలో చోటుచేసుకుంది. ఆ చిన్నారి మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల నుండి రాత్రి 8.45 వ‌ర‌కు ఒంటరిగా చీక‌టిలో ఉండిపోయింది. అంగ‌న్‌వాడీ టీచ‌ర్ ఆనారోగ్యంతో ఇంటికి వెళ్లిపోయింది. అనంత‌రం అక్క‌డ ప‌నిచేసే ఆయా పరిశీలించ‌కుండానే తాళం వేసి వెళ్లిపోయింది. చిన్నారి త‌ల్లి దండ్రులు త‌మ బిడ్డ ఇంటిద‌గ్గ‌ర కనిపించ‌క‌పోయేస‌రికి అంతా వెత‌క‌డం ప్రారంభించారు. స‌మీపంలోని కాలువులు, గుంత‌లు స‌యితం వెతికారు. సిసిటివి పుటేజిలు కూడా ప‌రిశీలించారు. స‌ర్పంచ్ స‌త్య‌నార‌య‌ణ జోక్యంతో అంగ‌న్‌వాడి టీచ‌ర్, ఆయాల‌ను పిలిపించి అంగ‌న్ వాడి కేంద్ర తాళం తీయించారు. స్టోర్ గ‌దిలో అప‌స్మార‌క స్థితిలో ఉన్న చిన్నారిని గుర్తించి.. వెంట‌నే బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చి స‌ప‌ర్య‌లు చేయ‌డంతో అవంతిక  సృహ‌లోకి వ‌చ్చింది. అంగ‌న్‌వాడీ టీచ‌ర్‌, ఆయాకు షోకాజు నోటీసులు ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.