కృష్ణా జిల్లా హంస‌ల దీవి బీచ్‌లో విషాదం..

కోడూరు (CLiC2NEWS): వారాంత‌పు సెల‌వుల్లో స‌ర‌దాగా గ‌డిపేందుకు హంస‌ల దీవికి వ‌చ్చిన ఓ కుటంబంలో విషాదం మిగిలింది. కృష్ణా జిల్లా కోడూరు మండ‌లం హంస‌ల దీవిలో ఆరుగురు కొ్ట్టుకుపోయారు. ద‌గ్గ‌రే ఉన్న మెరైన్ పోలీసులతో పాటు, ఆటో డ్రైవ‌ర్ క‌లిసి ఐదుగురిని ర‌క్షించారు. కానీ మ‌రొక‌రి ఆచూకీ ల‌భ్యం కాలేదు. ఈ ఐదుగురిలో ఒక మ‌హిళ ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో ఆస్పత్రికి త‌ర‌లించారు. ప‌రీక్షించిన వైద్యులు ఆమె అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు తెలిపారు. మిగిలిన న‌లుగురికి చికిత్స‌నందిస్తున్నారు. వీరంతా గుడివాడ‌కు చెందిన వారుగా గుర్తించారు. గ‌ల్లంతైన వారికోసం గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.