న‌క్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా ప్రాంగ‌ణంలో ఆలీప్ ఇగ్జిబిష‌న్‌ను ప్రారంభిచిన గ‌వ‌ర్న‌ర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని న‌క్లెస్ రోడ్డులో అసోసియేష‌న్ ఆఫ్ లేడీ ఎంట‌ర్ ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా అలీప్ ఎగ్జిబిష‌న్‌ను రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై ప్రారంభించారు. దీనిలో ఏర్పాటు చేసిన స్టాళ్ల‌ను గ‌వ‌ర్న‌ర్ ప‌రిశీలించారు. మేక్ ఇన్ ఇండియా లో భాగంగా.. రాష్ట్ర స్థాయి ప్ర‌ద‌ర్శ‌న -2023 ని పీపుల్స్ ప్లాజా ప్రాంగ‌ణంలో ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మ‌హిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్త‌లు , అంకుర కేంద్రాల వ్య‌వ‌స్థాప‌కులు రూపొందించిన వివిధ ర‌కాల ఉత్ప‌త్తుల‌తో 100 కు పైగా స్ఠాళ్లు కొలువుదీరినాయి. చేనేత వ‌స్త్రాలు, సేంద్రీయ ఉత్ప‌త్తులు, చిరుధాన్యాల‌తో త‌యారు చేసిన వంట‌కాలు, ఇంటి అలంక‌ర‌ణ సామాగ్రి వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.

1 Comment
  1. 출장마사지 says

    Incredible points. Sound arguments. Keep up the amazing work.

Leave A Reply

Your email address will not be published.