అంబ‌ర్‌పేట నాకు జీవం పోసింది:.: కిషన్​ రెడ్డి

హైదరాబాద్ (CLiC2NEWS): అంబర్​పేటకు వస్తే చాలా రోజుల తరువాత బిడ్డ తల్లి దగ్గరికి వచ్చినట్లు ఉందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. తాను ఢిల్లీలో ఉన్నానంటే కారణం అంబర్​పేట, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలని మంత్రి ప్పారు. జన ఆశీర్వాద యాత్ర శ‌నివారం హైదరాబాద్​లోని అంబర్​పేటకు చేరుకుంది. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని అంబర్ పేట ప్రజలు తన ప్రాణమని కిషన్​ రెడ్డి ఈ సంద‌ర్భంగా స్పష్టం చేశారు. అంబర్​పేట గురించి ప్రసంగిస్తూ కిషన్ రెడ్డి ఒక సంద‌ర్భంలో భావోద్వేగానికి లోన‌య్యారు. కేంద్ర మంత్రి అయినందుకు సంతోషం లేదని.. అంబర్​పేటకు దూరమయ్యానని బాధ ఉందన్నారు. అంబర్​పేట బిడ్డగా అందరూ గర్వపడేలా పని చేస్తానని చెప్పారు. అంబ‌ర్‌పేట నాకు త‌ల్లిలాంటిది. ఈ ప్రాంత‌మే నాకు జీవంపోసింది.. పార్టీ.. అంబ‌ర్‌పేట నాకు రెండు క‌ళ్ల‌తో స‌మానం అని కిష‌న్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ఈ సంద‌ర్భంగా కిష‌న్ రెడ్డి ప‌లు విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడంలో మీ అంబర్​పేట బిడ్డ కృషి కూడా ఉంద‌ని పేర్కొన్నారు. త్వ‌ర‌లో గోల్కొండ కోటను కూడా అభివృద్ధి చేస్తానని తెలిపారు. అంబర్​పేట ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాన‌ని పేర్కొన్నారు. అంబర్​పేట తనకు రెండు కళ్లతో సమానమని కిషన్​ రెడ్డి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.