రూ.143 కోట్ల‌తో ప‌శువుల‌కు అంబులెన్స్ సర్వీసులు..

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వైఎస్ ఆర్ సంచార ప‌శువుల‌ అంబులెన్స్‌లు అందుబాటులోకి తీసుకొచ్చింది. సిఎం క్యాంపు కార్యాల‌యం వ‌ద్ద ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి జెండా ఊపి వాహ‌నాల‌ను ప్రారంభించారు. ప‌శువులు ఆనారోగ్యానికి గురైతే సంప్ర‌దించేందుకు టోల్ ఫ్రీ నంబ‌ర్ 1962ను ఏర్పాటు చేశారు. మొద‌టి విడ‌త‌లో నియోజ‌కవ‌ర్గానికి ఒక‌వాహ‌నం చొప్పున 175 ప‌శువుల అంబులెన్స్‌లు కొనుగోలు చేశారు. రెండో ద‌శ‌లో రూ. 135 కోట్ల‌తో మ‌రో 165 అంబులెన్స్‌లు కొనుగోలు చేయ‌నున్నారు. ఈ అంబులెన్స్‌ల‌లో 20 ర‌కాల పేడ సంబంధిత ప‌రీక్ష‌లు, 15 ర‌కాల ర‌క్త ప‌రీక్ష‌లు చేసే ల్యాబ్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు.

 

 

Leave A Reply

Your email address will not be published.