AP: ఫ్రంట్లైన్ వర్కర్లకు సర్కార్ భరోసా..

విజయవాడ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ సర్కార్ జూనియర్ డాక్టర్ల ఎక్స్గ్రేషియా డిమాండ్ను నెరవేర్చింది. కోవిడ్తో మరణించే వైద్యులు, సిబ్బందికి ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఏకే సింఘాల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ విధి నిర్వహణలో మృతి చెందిన వైద్యుని కుటుంబానికి రూ.25 లక్షలు, స్టాఫ్ నర్సుకి రూ.20 లక్షలు, ఎఫ్ఎస్ఓ లేదా ఎమ్ఎస్ఓలకు రూ.15 లక్షల ఎక్స్గ్రేషియా అలాగే ఇతర వైద్య సిబ్బంది మృతి చెందితే రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం చెల్లించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకానికి అదనంగా ఈ ఎక్స్గ్రేషియా చెల్లించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులలో తెలిపింది.