రేపు ఒక్క‌రోజులో 15 ప‌రిశ్ర‌మ‌లు ప్రారంభించ‌నున్న ఎపి సిఎం చంద్ర‌బాబు

అమ‌రావ‌తి (CLiC2NEWS):  ఎపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రేపు ఒకే రోజులో 15 ప‌రిశ్ర‌మ‌లు ప్రారంభించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఆయ‌న రేపు తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు నియోజ‌క‌వ‌ర్గంలోని శ్రీ‌సిటీలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న శ్రీ‌సిటీలో 15 సంస్థ‌ల కార్య‌క‌లాపాలు ప్రారంభించ‌డంతో పాటు.. మ‌రో 7 సంస్థ‌ల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.   శ్రీ‌సిటీలో రూ. 900కోట్ల పెట్ట‌బ‌డితో 2,740 మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భించనున్నాయి. శ్రీ‌సిటి బిజెనెస్ సెంట‌ర్ లో వివిధ కంపెనీల సిఇఒల‌తో సిఎం భేటీ కానున్నారు.

Leave A Reply

Your email address will not be published.