AP Corona: కొత్తగా 11,303 కేసులు

అమరావతి(CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత కొంత మేరకు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 93,704 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 11,303 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17,01,493 కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 104 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 11,303 మంది మృతిచెందారు. 24 గంటల్లో 18,257 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం రికవరీ కేసులు 15,43,722 కు పెరిగాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 1,46,737 యాక్టివ్ కేసులు ఉన్నాయి.