AP Corona: కొత్తగా 16,167 కేసులు.. 104 మరణాలు

అమరావతి(CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 84,224 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 16,167 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 16,43,557కు చేరింది.
గత 24 గంటల్లో 21,385 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు 14,46,244 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,86,782 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 10,531 మంది కరోనా బారిన పడి ప్రాణాలు వదిలారు. తాజాగా రాష్ట్రంలో 104 మంది కరోనాతో మృతిచెందారు..
జిల్లాల వారీగా..
చిత్తూరులో 14, పశ్చిమ గోదావరిలో 13, విశాఖలో 11, అనంతపూర్లో తొమ్మి ది, నెల్లూరులో తొమ్మి ది, గుంటూరు లో ఎనిమిది, విజయనగరం లో ఎనిమిది, ప్రకాశం లో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఆరుగురు, కృ ష్ణలో ఆరుగురు, కర్నూ ల్ లో ఆరుగురు, శ్రీకాకుళం లో ఆరుగురు., కడపలో ఒక్కరు మరణించారు.