AP Corona: 14,792 కేసులు.. 57 మరణాలు

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 86,035 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 14,792 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,84,336 కు చేరింది.
గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 57 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,800 మంది మృతి చెందారు. తాజాగా ఏపీలో 8,188 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 9,62,250 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,14,158 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.