దాదాసాహెబ్ పాల్కే ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ‘జైభీమ్‌’, ‘నాంది’కి అవార్డులు..

12వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో సూర్య నటించిన‌ జైభీమ్, అల్ల‌రి న‌రేష్ న‌టించిన నాంది చిత్రాలు అవార్డులు సొంతం చేసుకున్నాయి. త‌మిళ స్టార్ హీరో సూర్య న‌టించిన చిత్రం జైభీమ్ ఇప్ప‌టికే చాలా అవార్డులు ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ఉత్త‌మ సినిమాగా ఎంపికైంది. ఈ సినిమాలో న‌టించిన మ‌ణికంద‌న్‌కి బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్ అవ‌ర్డు కూడా వ‌రించింది. అల్ల‌రి న‌రేశ్ న‌టించిన నాంది సినిమాని డైరెక్ట‌ర్ విజ‌య్ క‌న‌క‌మేడ‌ల రూపొందించారు. ఈ చిత్రానికి బెస్ట్ డెబ్యూ డైరెక్ట‌ర్ అవార్డును విజ‌య్ అందుకున్నాడు.

Leave A Reply

Your email address will not be published.