ప‌ట్ట‌ప‌గ‌లే బ్యాంక్ దోపిడీ..

క‌శింకోట (CLiC2NEWS): అన‌కాపల్లి జిల్లాలో ప‌ట్ట‌ప‌గ‌లే బ్యాంకు దోపిడీకి గురైంది. క‌శింకోట మండ‌లం న‌ర్సింగ‌ప‌ల్లిలోని ఎపి గ్రామీణ వికాస్ బ్యాంకులో చొర‌బ‌డిన దుండ‌గుడు తుపాకీతో క్యాషియ‌ర్‌ను బెదిరించి అత‌ని వ‌ద్ద ఉన్న రూ. 3.30 ల‌క్ష‌లు లాక్కొన్ని ప‌రార‌య్యాడు. సినీ ఫ‌క్కీలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌తో బ్యాంకు సిబ్బందితో పాటు ఖాతాదారులు కంగుతిన్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. దోపిడీకి పాల్ప‌డిన వ్య‌క్తి ఖాతాదారుడి మాదిరిగా బ్యాగ్ త‌గిలించుకుని, హెల్మెట్ ధ‌రించి బ్యాంకులోప‌లికి వ‌చ్చాడ‌ని సిబ్బంది తెలిపారు. నిందితుడు పారిపోతున్న దృశ్య‌లు సిసి కెమెరాల్లో రికార్డ‌య్యాయి.

Leave A Reply

Your email address will not be published.