ఉద్రిక్త ప‌రిస్థితుల్లో బ్యాంకులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి నిర్మలా సీతారామ‌న్‌

Nirmala Seetharaman: భార‌త్‌-పాక్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో బ్యాంకులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కేంద్ర ఆర్ధిక‌ మంత్రి నిర్మలా సీతారామ‌న్ సూచించారు. వినియోగ‌దారులు, వ్యాపారాల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా చూడాల‌ని, అంత‌రాయం లేని సేవ‌లు అంద‌జేసే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

సైబ‌ర్ భ‌ద్ర‌త స‌న్న‌ద్ధ‌త‌పై బ్యాంకులు, ఆర్‌బిఐ, ఎస్‌పిసిఐ , బీమా సంస్థ‌ల ఉన్న‌తాధికారుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో నిర్మ‌లా సీతారామ‌న్ బ్యాంకుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. కార్యాల‌యాల‌తో పాటు డిజిటల్ విధానంలో కూడా ఎటువంటి అంత‌రాయాలు లేకుండా ఉండాల‌న్నారు. ఎటిఎంల‌లో న‌గ‌తు అందుబాటులో ఉంచాల‌న్నారు. యుపిఐ సేవ‌లు స‌జావుగా సాగేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. ఆక‌స్మిక ప‌రిస్తితుల‌ను ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాల‌ని సూచించారు. స‌వాళ్ల‌తో కూడిన స‌మాయంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధ‌రించడంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల పాత్ర కీల‌క‌మ‌ని పేర్కొన్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.