ప్లే ఆఫ్స్కు అర్సిబి .. 27 పరుగుల తేడాతో బెంగళూరు విజయం..
బెంగళూరు (CLiC2NEWS): చెన్నై, బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్లో 27 పరుగుల తేడాతో ఆర్సిబి విజయం సాధించి ప్లేఆఫ్స్కు దూసుకెళ్లింది. చెన్నై సూపర్ కింగ్స్ టోర్ని నుండి నిష్క్రమించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. రవీంద్ర 61, రహానె 33, జడేజా 42* ధోని 25 పరుగులు చేశారు.