జలమండలిలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి

హైదరాబాద్ (CLiC2NEWS): ప్రముఖ సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీజీఎం మహ్మద్ అబ్దుల్ ఖాదర్ హాజరై భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆనాటి సమాజంలో పేరుకుపోయిన అసమానతలు, దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ అని పేర్కొన్నారు. బాలికా విద్య కోసం ఆనాడే పరితపించిన మహనీయుడన్నారు. సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా ఆయన రచయితగా, పాత్రికేయుడిగానూ పోరాడారని పేర్కొన్నారు.
—