డిప్యూటీ సిఎంగా భట్టి

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో కొత్త సర్కార్ కొలువుదీరింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ముఖ్యమంత్రి, డిప్యూటీ సిఎం మంత్రులు ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ముందుగా ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్ తర్వాత డిప్యూటీ సిఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణం చేశారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్… భట్టి విక్రమార్క చేత ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర అగ్ర నేతలు, భారీ సంఖ్యలో అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.