44 పాఠ‌శాల‌ల‌కు బాంబు బెదిరింపులు!

బెంగ‌ళూరు (CLiC2NEWS): క‌ర్ణాట‌క‌లోని బెంగ‌ళూరులో సుమారు 44 పాఠ‌శాల‌ల‌కు బాంబు బెదిరింపులు వ‌చ్చిన‌ట్లు సమాచారం. శుక్ర‌వారం ఉద‌యం గుర్తుతెలియని ఒక ఇ మెయిల్ నుండి ఈ బెదిరింపుకాల్స్ రావ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. ముందుగా 15 స్కూళ్ల‌కు ఈ బెదిరింపు ఇమెయిల్స్ వ‌చ్చిన‌ట్లు తెలిసింది. అనంత‌రం అది 44 స్కూళ్ల‌కు బెదిరింపు మెయిల్స్ వచ్చిన‌ట్లు స‌మాచారం.  దీనిపై స‌మాచారం అందుకున్న పోలీసులు.. ఉపాధ్యాయుల‌ను, విద్యార్థుల‌ను పాఠ‌శాల‌ల‌నుండి పంపించివేశారు. దీంతో న‌గ‌రంలోని విద్యాసంస్థ‌ల‌కు బెదిరింపులు రావ‌డంతో విద్యార్థులు, త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భ‌యాందోళ‌న‌కు గురైనారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.