బిఆర్ఎస్.. ఏ పార్టీలోనూ విలీనమయ్యే ప్రసక్తే లేదు: కెటిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): భారతీయ రాష్ట్ర సమితి ఏ ఇతర పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని ఆ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు కోసం పుట్టి, పోరాడిన బిఆర్ఎస్ పార్టి ఇప్పుడే కాదు.. ఎప్పుడూ కూడా ఏ పార్టీలో విలీనం కాదన్నారు. ఈ విషయం తెలంగాణ ప్రజలకు కూడా తెలసని.. ఇరకాటంలో పడిన ప్రతిసారీ, కాంగ్రెస్ , బిజెపి నేతలు పనికిరాని చెత్త అంశాన్ని తెరమీదకు తెస్తున్నారన్నారు. ఈ విధంగా రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు.
దేశంలో ఎక్కడా లేని కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతుందని కెటిఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపి సిఎం.రమేశ్ ఇద్దరూ కలిసి వస్తే.. హెచ్సియు రూ.10వేల కోట్ల కుంభకోణంపైనా, రూ.1660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ స్కామ్ పైనా కలిసి చర్చిద్దామని కెటిఆర్ సవాల్ విసిరారు. వీరిద్దరి బాగోతాన్ని తాను బయటపెట్టడంతో ఏంచేయాలో తోచక ఇద్దరూ సతమతమవుతున్నరని ఆయన వ్యాఖ్యానించారు.