మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబును క‌లిసిన బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు

హైద‌రాబాద్  (CLiC2NEWS): మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబును బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు క‌లిశారు. త‌మ నియోజ‌కవ‌ర్గాల్లో అభివృద్ధి ప‌నుల‌కు స‌హ‌క‌రించాల‌ని మంత్ర‌ని కోరారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి , వివేకానంద గౌడ‌, మాధ‌వ‌రం కృష్ణారావు, రాజ‌శేఖ‌ర్ రెడ్డి , అరిక‌పూడి గాంధీ, ల‌క్ష్మారెడ్డి శ‌నివారం రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మినిస్ట‌ర్ శ్రీ‌ధ‌ర్‌బాబును క‌లిసి అభివృద్ధి ప‌నుల కు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను అంద‌జేశారు. కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌ర్వాత జిహెచ్ఎంసికి నిధులు ఇవ్వ‌లేద‌ని.. జిహెచ్ఎంసికి నిధులు విడుద‌ల‌ చేయాల‌ని మంత్రి దృష్టికి తెచ్చారు.

Leave A Reply

Your email address will not be published.