జీపును వెనుక నుంచి ఢీకొన్న సిమెంట్ లారీ: 8 మంది మృతి
బెంగళూరు (CLiC2NEWS): కర్ణాటకలో ప్రయాణికులతో వెళ్తున్న జీపును వెనక నుంచి వచ్చిన సిమెంటు లారీ ఢీకొట్టింది. ఈ సంఘటన చికబల్లాపూర్ జిల్లాలోని చింతామణి తాలూకా మరినాయకనహళ్లి దగ్గర జరిగింది. ఈ ప్రమాదంలో జీపులోని 8 మంది ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న కంచర్లహళ్లి పోలీసులుక్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.