ప్ర‌ధాని మోడీని స‌త్క‌రించిన చంద్ర‌బాబు, ప‌వ‌న్‌

విజ‌య‌వాడ (CLiC2NEWS): భారీ స‌భ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి వ‌ర్గం ప్ర‌మాణం చేశారు. బుధ‌వారం విజ‌య‌వాడ‌ స‌మీపంలో జ‌రిగిన భారీ స‌భ‌లో గ‌వ‌ర్న‌ర్ జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్ తెలుగు దేశం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు చేత ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేయించారు. అనంత‌రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రిగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ప్ర‌మాణం చేశారు.

ప్ర‌మాణాస్వీకారాంత‌రం చంద్ర‌బాబు , ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌ధాన మంత్రి మోడీకి శాలువా క‌ప్పి, జ్ఞాపిక‌ను బ‌హుక‌రించారు. అనంత‌రం ప్ర‌ధాని చిరంజీవి, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో ముచ్చ‌టించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, గ‌డ్క‌రీ, చిరాగ్ పాశ్వాన్‌, రామ్మోహ‌న్ నాయుడు, మెగా స్టార్ చిరంజీవి, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ స‌హా అతిర‌థ మ‌హార‌థులు హాజ‌ర‌య్యారు.

Leave A Reply

Your email address will not be published.