సికింద్రాబాద్ నుండి బయలుదేరే పలు రైళ్ల స్టేషన్లు మార్పు
హైదరాబాద్ (CLiC2NEWS): సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరాల్సిన పలు రైళ్లను పలు స్టేషన్లకు మార్పు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో పేర్కొంది. సికింద్రాబాద్ స్టేషన్లో పునరాభివృద్ది పనులు జరుగుతున్న నేపథ్యంలో రైళ్లను వేరే స్టేషన్ల నుండి బయలుదేరనున్నట్లు తెలిపింది. అక్టోబర్ 20వ తేదీ నుండి 26 వరకు పలు రైళ్ల రాకపోకలను మార్చారు.
సికింద్రాబాద్ – పోర్బందర్ సర్వీసు రైలు ఉందా నగర్ నుండి బయలుదేరుతుంది.
సిద్దిపేట-సికింద్రాబాద్ రైలు మల్కాజిగిరి నుండి బయలుదేరును
పుణె-సికింద్రాబాద్ రైలు హైదరాబాద్ స్టేషన్ నుండి బయలుదేరుతుంది.
చర్లపల్లి నుండి బయలు దేరే రైళ్ల వివరాలు..
సికింద్రాబాద్ – అగర్తలా
సికింద్రాబాద్ – దర్భంగా
సికింద్రాబాద్ – దానాపూర్
సికింద్రాబాద్ – మణుగూరు
సికింద్రాబాద్ – ముజఫర్పూర్
సికింద్రాబాద్ – రామేశ్వరం
సికింద్రాబాద్ – రేపల్లె
సికింద్రాబాద్ – సంత్రగచ్చి
సికింద్రాబాద్ – సిల్చార్
సికింద్రాబాద్ – యశ్వంత్ పూర్
Also Read: నీటి కుంటలోకి దిగి ఆరుగురు చిన్నారులు మృతి
[…] సికింద్రాబాద్ నుండి బయలుదేరే పలు… […]