నేనూ కార్మికుడినే, క‌ష్ట‌మొస్తే మీ వెన‌కే ఉంటా.. చిరంజీవి

హైద‌రాబాద్ (CLiC2NEWS): సినీ ప‌రిశ్ర‌మ‌కోసం ఎంతోమంది త‌మ కుటుంబాల‌ను త్యాగం చేశార‌ని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. న‌గ‌రంలోని కోట్ల విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి స్టేడియంలో సినీ కార్మికోత్స‌వం అట్ట‌హాసంగా జ‌రిగింది. తెలుగు ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఆధ్వ‌ర్యంలో వేడుక‌లు నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో చిరంజీవి మాట్లాడుతూ.. రాత్రీప‌గ‌లూ తేడా లేకుండా సినీ కార్మికుల క‌ష్ట‌ప‌డ‌తార‌ని, ఎన్నో బాధ‌ల‌ను దిగ‌మింగుకొని సినిమా కోసం కార్మికులు ప‌నిచేస్తార‌ని పేర్కొన్నారు. కానీ వారి జీవితాల‌కు భ‌రోసా లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈసంద‌ర్భంగా ఈ పండుగ‌కు నన్ను ఆహ్వానించిన ఫెడ‌రేష‌న్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. నాకు తెలిసి ఇలాంటి కార్య‌క్ర‌మం ఎప్పుడూ జ‌ర‌గ‌లేద‌ని చిరంజీవి అన్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రి దారి వారిదే అవ‌డం వ‌ల‌న ఇంత‌కు ముందు ఇలాంటి మేడేను జ‌రుపుకోలేదు. ఈరోజు కోసం నేను అమెరికా ప‌ర్య‌ట‌న వాయిదా వేసుకున్నాన‌ని తెలిపారు. నేనూ కార్మికుడినే, ఎవ‌రికి ఏ క‌ష్ట‌మొచ్చినా వారి వెన‌కే ఉంటాన‌ని చిరంజీవి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.