తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సిఎం చంద్రబాబు
తిరుమల (CLiC2NEWS): శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్బంగా ఎపి రాష్ట్ర ప్రభుత్వం నుండి సిఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం సిఎం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట టిటిడి ఇఒ శ్యామల రావు తదితరులు ఉన్నారు.