మ‌హిళా సాధికార‌త మాటల్లో చెప్పేది కాదు.. చేత‌ల్లో చూపించాలి. సిఎం చంద్ర‌బాబు

అమ‌రావ‌తి (CLiC2NEWS): మ‌హిళ‌ల‌కు ఆస్తిలో హ‌క్కును తొలిసారి ఎన్‌టిఆర్ క‌ల్పించారని సిఎం చంద్ర‌బాబు అన్నారు. శాస‌న‌స‌భ స‌మావేశాల్లో ఆయ‌న మాట్లాడుతూ..తెలుగు దేశం పార్టి.. తెలుగించి ఆడ‌ప‌డుచుల పార్టి అని సిఎం అన్నారు. త‌మ ప్ర‌భుత్వంలో ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా మ‌హిళ‌ల‌ను దృష్టిలో పెట్టుకునే చేశామ‌న్నారు. త‌ల్లి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వకుండా గ‌త సిఎం ఉన్నార‌ని.. ఇచ్చిన ఆస్తిని సైతం వెనక్కి తీసుకోవాడానికి కోర్టుకుకూడా వెళ్లారన్నారు. మా ప్ర‌భుత్వ హ‌యాంలో తొలిసారి విద్యా, ఉద్యోగాల్లో మ‌హిళ‌ల‌కు 33% రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించామ‌న్నారు. దీంతో వారు బాగా చ‌దువుకున్నారు. ఆడ బిడ్డ పుడితే రూ.5వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశామ‌ని .. స్థానిక సంస్థ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాం. డీలిమిటేష‌న్ పూర్త‌యితే సుమారు 75 మంది మ‌హిళ‌లు అసెంబ్లీకి వ‌స్తార‌ని సిఎం తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.