ఈ నెల 15న ఐదు వైద్య కాలేజిల‌ను ప్రారంభించ‌నున్న సిఎం జ‌గ‌న్‌

తొలి విడ‌త‌లో ఐదు వైద్య క‌ళాశాల‌లు ప్రారంభం

విజ‌య‌న‌గ‌రం (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ఈ నెల 15వ తేదీన ఐదు ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజిల‌ను ప్రారంభించ‌నున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల నిర్మాణం జ‌ర‌గుతుంద‌ని.. మొద‌టి ద‌శ‌లో పూర్త‌యిన ఐదు కాలేజిల‌ను 15వ తేదీన సిఎం జ‌గ‌న్ ప్రారంభిచనున్న‌ట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడుద‌ల ర‌జ‌ని తెలిపారు. విజ‌య‌న‌గ‌రం, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం, ఏలూరు, మ‌చిలీప‌ట్నం, నంద్యాలలోని కాలేజీల‌ను ప్రారంభిస్తారు. వ‌చ్చే ఏడాది మ‌రో ఐదు నిర్మాణాలు పూర్త‌వ‌నున్న‌ట్లు తెలిపారు. విజ‌య‌న‌గ‌రంలోని కాలేజి ప్రారంభోత్స‌వానికి సిఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు అన్ని ఏర్పాట్లను మంత్రులు ప‌రిశీలించారు.

Leave A Reply

Your email address will not be published.