రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): ముఖ్యమంత్రి కెసిఆర్ రంజాన్ పర్వదినం పురస్కరించుకొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని సిఎం ఆకాంక్షించారు. రంజాన్ మాసం క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, ఆధ్యాత్మికతను పెంపొందిస్తందని లౌకిక వాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.