తెలంగాణ కేబినేట్ విస్తరణకు పచ్చజెండా ఊపిన అధిష్టానం..

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు కేబినేట్ విస్తరణ జరిగే అవకాశమున్నట్లు సమాచారం. కొత్తగా ముగ్గురు లేదా నలుగురికి మంత్రివర్గంలో చోటు దక్కనుంది. ఇప్పటికే కసరత్తు చేసిన పేర్లను పార్టి అధిష్టానానికి సమర్పించినట్లు తెలుస్తోంది. రెడ్డి, బిసి, ఎస్సి సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందని సమాచారం. ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయానికల్లా మంత్రివర్గంలోకి తీసుకునేవారి పేర్లపై స్పష్టత రానుంది. ఆదివారం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మకు సమాచారం కూడా అందించినట్లు తెలుస్తోంది.