జనవరి 3 నుండి పిల్లలకు కరోనా టీకాలు..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల 3వతేది నుండి పిల్లలకు కరోనా టీకాలు వేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. రాష్ట్రంలో 15 నుండి 18 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్న వారికి కొవిడ్ టీకాలు జనవరి 3 వతేదీనుండి వేయనున్నారు. హైదరాబాద్, పురపాలికల్లో కొవిన్ పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని తెలిపారు. పిహెచ్సిలు, వైద్య కళాశాలల్లో కొవిడ్ టీకాలు వేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.