కుమార్తెకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపి వ‌స్తూ..

రోడ్డు ప్ర‌మాదంలో దంప‌తులు మృతి..

గ‌జ్వేల్ (CLiC2NEWS): హైద‌రాబాద్‌లో చ‌దువుకుంటున్న త‌మ కూతురు జ‌న్మ‌దిన వేడుకుల‌ను పూర్తి చేసుకుని వ‌స్తున్న త‌ల్లిదండ్రులు రోడ్దు ప్ర‌మాదానికి గురై మృతిచెందారు. గ‌జ్వేల్ ప‌ట్ట‌ణానికి చెందిన శ్రీ‌ధ‌ర్ (42), జ‌ల‌జ (40) దంప‌తులు హైద‌రాబాద్ లోని హాస్ట‌ల్‌లో చ‌దువుకుంటున్నత‌మ‌ కుమార్తె వ‌ద్ద‌కు వెళ్లారు. హాస్ట‌ల్‌లో కుమార్తె పుట్టిన రోజు వేడుక‌ నిర్వ‌హించి తిరిగి వ‌స్తండ‌గా వారు ప్ర‌యాణిస్తున్న కారు ప్ర‌మాదానికి గురైంది. ప్ర‌జ్ఞాపూర్ స‌మీపంలోకి రాగానే కారు అదుపు త‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. అదే స‌మ‌యంలో మ‌రోకారు వీరి వాహ‌నాన్ని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో దంప‌తులిద్ద‌రూ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కున్న మృత దేహాల‌ను బ‌య‌ట‌కు తీసి పోస్టుమార్టం నిమిత్ం గ‌జ్వేల్ ప్ర‌భుత్వాసుపత్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదం కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.