వైద్యారోగ్యశాఖలో పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్!

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాన రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖలో ఉన్న వివిధ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తం 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు.. 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్ నర్సుల పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ పోస్టులను తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక బోర్డు ద్వారా ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.