భీమ్లా నాయక్లో నిత్యా మీనన్ ఎలా ఉందో చూశారా!
![](https://clic2news.com/wp-content/uploads/2021/10/bhimla-nitya.jpg)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్- రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళం హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్ ఇది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన ఫస్ట్లుక్, ప్రచారా చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి‘అంతా ఇష్టం’అనే పాట అక్టోబర్ 15న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలియజేస్తూ..పవన్ కల్యాణ్, నిత్యామీనన్లకు సంబంధించిన కొత్త పోస్టర్ని విడుదల చేసింది.
ఈ మేరకు సితార ఎంటర్టైన్మెంట్స్ ఒక పోస్టర్ను విడుదల చేసింది. ఒక గుడిసె ముందు పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్ కూర్చొని ఉన్న ఈ పోస్టర్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్య దేవర నాగవంశీ భీమ్లా నాయక్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడు సాగర్ కె చంద్ర . మాటలు, స్క్రీన్ప్లే త్రివిక్రమ్ శ్రీనివాస్.
Get ready for the other side of our #BheemlaNayak ♥️
The alluring 2nd Single ~ #AnthaIshtam… out on 15th Oct ✨
A @MusicThaman Musical!🎹@pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @ramjowrites @dop007 @NavinNooli @vamsi84 @adityamusic pic.twitter.com/MD0pQ2wyQQ
— Sithara Entertainments (@SitharaEnts) October 5, 2021