`అనంత` జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు మృతి

అనంత‌పురం (CLiC2NEWS):  జిల్లాలో వేర్వేరు చోట్ల జ‌రిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో 7 గురు మ‌ర‌ణించారు. పామిడి శివారులో 44వ జాతీయ ర‌హదారిపై కూలీల ఆటోను లారీ ఢీకొన‌డంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు కూలీలు మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. త‌హ‌సీల్దార్ కార్య‌ల‌యం స‌మీపంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని క్ష‌త‌గాత్రుల‌ను ఆస్పత్రికి తరలించారు. మృతులు గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన శంకరమ్మ, నాగవేణి, చిట్టెమ్మ(35), సుబ్బమ్మ(45), సావిత్రి‍‌(40) గా గుర్తించారు.

ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయింది. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వీరంతా పెద్ద‌వ‌డుగూరు మండ‌లం కొట్టాల‌ప‌ల్లిలో ప‌త్తికోత‌కు వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో 8 మంది గాయ‌ప‌డ‌గా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిలో ఒకరు చికిత్స పొందుతూ చనిపోయారు. ఆటో డ్రైవర్ రాంగ్ రూట్​లో వెళ్లడం వల్లే ళ్తుండడం వల్లే ప్రమాదం జరిగిందని తాడిపత్రి డీఎస్పీ చైతన్య చెప్పారు. మృతుల‌ను సుబ్బ‌మ్మ‌, శంక‌ర‌మ్మ‌, నాగవేణి, సావిత్రి, చౌడ‌మ్మ‌గా గుర్తించారు. వీరిది గార్ల‌దిండె మండ‌లం కొప్ప‌లగొండ‌.

పాదాచారుల‌ను ఢీ కొన్న కారు.
ఇదే జిల్లాలో జ‌రిగిన మ‌రో ప్ర‌మాదంలో ఓ కారు పాదచారులను ఢీకొంది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు మృతి చెందారు. పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద ప్రమాదం జరిగింది. మిడుతూరు వద్ద జాతీయ రహదారిపై కారు పాదచారులపైకి దూసుకెళ్లిన ఘటనలో యాకోబ్‌(62), నారాయణ(60) అనే వ్యక్తులు మృత్యువాతపడ్డారు. సెక్యురిటీ గార్డులుగా పనిచేస్తున్న వారు.. విధులు ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులుచెప్పారు.

Leave A Reply

Your email address will not be published.