AP: ఇఎపిసెట్ ఫలితాలు విడుదల
అమరావతి (CLiC2NEWS): ఎపి ఇఎపిసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. విజయవాడలో మంగళవారం విద్యామంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు మొత్తం 3,01,172 మంది దరఖాస్తు చేసుకోగా, 2,82,496 మంది పరీక్షలకు హాజరయ్యారు.
ఇంజినీరింగ్ పరీక్ష 1,94,752
వ్యవసాయ కోర్టు పరీక్ష 87,744 మంది రాశారు.
వీటిలో ఇంజినీరింగ్లో 89.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
వ్యవసాయ విభాగంలో 95.06 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు