AP: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు అస్వస్థత..

హైదరాబాద్ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. దీంతో ఆయనను విజయవాడ నుంచి చికిత్స కోసం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఎఐజి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది. 2019లో ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమితులైన విషయం తెలిసిందే.