తిరుమ‌ల‌లో ప్ర‌త్యక్ష‌మైన న‌కిలీ రూ.300 టికెట్లు

తిరుమ‌ల (CLiC2NEWS): తిరుమ‌ల‌లో న‌కిలీ రూ.300 ప్ర‌త్యేక ద‌ర్శ‌న‌ టికెట్ల‌తో వెళుతున్న వారిని విజిలెన్స్ అధికారులు ప‌ట్టుకున్నారు. వారు క‌ల‌ర్ జిరాక్స్ టికెట్ల‌తో క్యూలైన్‌లో ఉన్నారు. స్కానింగ్ చేసే ద‌గ్గ‌ర ఉండే రుద్ర‌సాగ‌ర్ అనే వ్య‌క్తి చొర‌వ‌తో న‌కిలీ టికెట్ల‌తో కొంద‌రు భ‌క్తులు ద‌ర్శ‌నం క్యూలోకి వెళ్లారు. విజిలెన్స్ అధికారులు ప‌సిగ‌ట్టి అదుపులోకి తీసుకున్నారు. న‌కిలి టికెట్ల వ్య‌వ‌హారంలో ప‌లువురు ఎపి టూరిజం, టిటిడి కార్పొరేష‌న్ అధికారుల హ‌స్త‌మున్న‌ట్లు స‌మాచారం. అమృత్ యాద‌వ్ అనే పాత నేర‌స్థుడు చెన్నైకి చెందిన మోహ‌న్‌రాజ్ అనే వ్య‌క్తిని మోసం చేసి 4 టికెట్ల‌ను రూ. 11 వేల‌కు విక్ర‌యించాడు. ఆ మొత్తాన్ని రుద్ర‌సాగ‌ర్‌తో క‌లిసి పంచుకున్న‌ట్లు స‌మాచారం. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.