ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం!

విజ‌య‌వాడ (CLiC2NEWS): ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు వ్య‌క్తులు ఓ లాడ్జిలో పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నించారు. విజ‌య‌వాడ‌లోని ఆర్టీసీ బ‌స్టాండు అవుట్‌గేట్ స‌మీపంలోని లాడ్జిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు బాధితుల‌తో ఉప్పునీరు తాగించి పురుగుల మందును క‌క్కించారు. వారిని ప్ర‌భుత్వాసుపత్రికి త‌ర‌లించారు.

పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. మ‌చిలీప‌ట్నానికి చెందిన జూపూడి వెంక‌టేశ్వ‌ర‌రావు కుటుంబం ఆర్ధిక ఇబ్బందులు కారణంగా గ‌త నెల‌లో విజ‌య‌వాడకు వ‌చ్చి ఓ లాడ్జిలో ఉంటున్నారు. బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి య‌త్నించే ముందు వీరు త‌మ కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రికి ఫోన్ ద్వారా స‌మాచాం అందించారు. పోలీసులు వెంట‌నే స్పందించ‌డంతో న‌లుగురు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. పోలీసులు కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.