ఢిల్లీలో ఘోర అగ్ని ప్ర‌మాదం.. 27 మంది స‌జీవ ద‌హ‌నం

న్యూఢిల్లీ (CLiC2NEWS): న్యూఢిల్లీలో శుక్ర‌వారం సాయంత్రం ఘోర అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో దాదాపు 27 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. మ‌రో 12 మంది తీవ్రంగా గాయాల‌పాల‌య్యారు. ఢిల్లీలోని ముంద్కా మెట్రో పిల్ల‌ర్ 544 వ నంబ‌రు పిల్ల‌ర్ ద‌గ్గ‌ర‌లోని మూడంత‌స్తుల భ‌న‌వంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. విష‌యం తెలుసుకున్న వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లం నుంచి 60-70 మందిని కాపాడి బ‌య‌ట‌కి తీసుకువ‌చ్చామ‌ని పేర్కొన్నారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు తెలిపారు. దాదాపు 30 అగ్నిమాప‌క యంత్రాల సాయంతో మంట‌ల‌ను అదుపు చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఈ భ‌వ‌నంలో ప‌లు కంపెనీల కార్యాల‌యాలు ఉన్నాయి. కాగా ఈ ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.

Leave A Reply

Your email address will not be published.