చెన్నై రాజీవ్‌గాంధీ ఆసుప‌త్రిలో అగ్ని ప్ర‌మాదం!

చెన్నై (CLiC2NEWS): త‌మిళ‌నాడులోని చెన్నైలో స‌ర్కార్ ద‌వాఖానాలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. రాజీవ్‌గాంధీ ప్ర‌భుత్వాసుప‌త్రిలో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. బుధ‌వారం 11 గంట‌ల స‌మ‌యంలో ఐసియులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. ఒక్క‌సారిగా ఆసుప‌త్రిలో మంటలు ఎగ‌సిప‌డ‌టంతో భారీగా పొగ క‌మ్ముకుంది. దీంతో రోగులు శ్వాస‌తీసుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు, అగ్ని మాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంట‌లను అదుపులోకి తీసుకొచ్చే య‌త్నం చేస్తున్నారు.
ప్ర‌మాద స‌మ‌యంలో దాదాపు 50 మంది రోగులు ఆసుప‌త్రిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాగా ఆసుప‌త్రిలో ఐసియులో షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా మంట‌లు చెలరేగిన‌ట్లు తెలుస్తోంది. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.