Visakhapatnam: కోర్బా ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంట‌లు..

విశాఖ‌ప‌ట్నం (CLiC2NEWS): రైల్వే స్టేష‌న్‌లో ఆగిఉన్న కోర్బా ఎక్స్‌ప్రెస్ రైలులో మంట‌లు చెల‌రేగాయి. స్టేష‌న్‌లోని 4వ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న రైలులో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మూడు ఎసి బోగీలలో మంట‌లు అలుముకుని ద‌గ్ధ‌మ‌య్యాయి. ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో ప్ర‌యాణికులు ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది.

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని కోర్బా నుండి విశాఖ‌ప‌ట్నం చేరుకున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఎసి బోగీలు బి7, బి6, ఎం1 లలో మంట‌లు వ్యాపించాయి. రైల్వే సిబ్బంది, అగ్నిమాప‌క యంత్రాల ద్వారా ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంట‌లు అదుపులోకి తెచ్చారు.

Leave A Reply

Your email address will not be published.