దేశంలో `తొలి సూర్య గ్రామం`

మోథేరా (CLiC2NEWS): గుజరాత్ పర్యటనలో ప్రధాని మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా ఆదివారం మెథేరాలోని దేశంలోనే తొలిసారి సోలార్ విద్యుత్ విలేజ్గా ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సూర్య దేవాలయం ఉన్న గ్రామంగానే మోథేరా దేశానికి తెలుసు అని.. ఇప్పుడు దేశ ప్రజలంతా దీన్న సూర్యగ్రామంగానే గుర్తిస్తారని అన్నారు. ఈ పర్యటనలో దాదాపు రూ. 14,600 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శంకు స్థాపన చేశారు.