త‌మిళ‌నాడులో ఒంగోలుకు చెందిన ఐదుగురు విద్యార్థులు మృతి

చెన్నై(CLiC2NEWS):  త‌మిళ‌నాడులో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాత ప‌డ్డారు. వీరంతా ఒంగోలుకు చెందిన వారుగా స‌మాచారం. ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్ర‌యాణం చేస్తున్న కారు తిరువ‌ళ్లూరు స‌మీపంలో లారీని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు అక్క‌డికక్క‌డే మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. మృతుల‌ను నితీశ్ వ‌ర్మ‌, చేత‌న్‌,రామ్‌, యుకేష్‌, నితీశ్ , గుర్తించారు. చైతన్య‌ విష్ణుకు గాయ‌లైన‌ట్లు తెలుస్తుంది. వీరంతా చెన్నైలోని ఎస్ ఆర్ ఎం ఇంజినీరింగ్ కాలేజీలో చ‌దువుతున్నారు. వీరంతా తిరువ‌ళ్లూరు వెళ్లి , తిరిగి వ‌స్తున్న క్ర‌మంలో వీరు ప్ర‌యాణిస్తున్న కారు ప్ర‌మాదానికి గురైంది.

Leave A Reply

Your email address will not be published.