ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
ఐదు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంది.
ఉత్తరప్రదేశ్లో బిజెపి ఆధిక్యంలో ఉంది. బిజెపి 146 స్థానాలలో గెలపొందింది. ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్షకు పైగా మెజారిటీతో గోరఖ్పూర్ అర్భన్ నుంచి గెలుపొందారు.
పంజాబ్లో 89 స్థానాలలో గెలపొందింది. పంజాబ్ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఆప్ను దేశమంతా విస్తరిస్తామని, ప్రజలు ఆదరించాలి అని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు.
ఉత్తరాఖండ్ లో బిజెపి 33 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ 13 స్థానాల్లో గెలుపొందింది. సిఎం పుష్కర్సింగ్ ఓటమిపాలయ్యారు.
గోవాలో బిజెపి 20 స్థానాలు గెలుపొందింది
మణిపూర్ లో బిజెపి 14 స్థానాలు గెలుచుకొంది.
ముఖ్యమంత్రి ఎన్. బీరన్సింగ్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిపై 17 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.