TS: దళిత బంధు కోసం రూ. 500 కోట్లు విడుదల

హైదరాబాద్ (CLiC2NEWS): హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితులకు తెలంగాణ సిఎం కెసిఆర్ గుడ్న్యూస్ చెప్పారు. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు సిఎం దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్నారు. మొన్న ముఖ్యమంత్రి దత్తత గ్రామం వాసాలమర్రి దళితుల కోసం దళితబంధు పథకం కింద రూ. 7.60 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం రూ. 500 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీన సిఎం కెసిఆర్ ఈ పథకాన్ని హుజురాబాద్ వేదికగా ప్రారంభించనున్నారు. ఈ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ దళిత బంధు పథకం అమలు కానున్న విషయం తెలిసిందే. దీనికోంస మంత్రులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.