నేడు హైదరాబాద్లో ఫార్మలా-ఈ ప్రపంచ ఛాంపియన్ షిప్..
హైదరాబాద్ (CLiC2NEWS): నేడు నగరంలో జరగబోయే ప్రపంచ ఛాంపియన్ షిప్ ఫార్మాలా-ఈ కార్ రేసింగ్ను తిలికించేందుకు ప్రముఖులు సైతం హైదరాబాద్కు విచ్చేశారు. నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన రేసింగ్ సర్క్యూట్లో మధ్యాహ్నం 3 గంటలకు రేస్ ప్రారంభమవుతుంది. ఈ రేసును చూడటానికి నగరవాసులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు సైతం హాజరయ్యారు. సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, దీపక్ హుడా, బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీ చంద్, మంత్రి కెటిఆర్ ఎంపి సంతోష్, సినీ హీరో రామ్ చరణ్ పలువురు హాజరాయ్యారు.
