ప్రకాశం జిల్లాలో విషాదం.. చెరువులో దిగి నలుగురు చిన్నారులు మృతి
అక్కచెరువుపాలెం (CLiC2NEWS): ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలం అక్కచెరువుపాలెంలో విషాదం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం ఆరుగురు చిన్నారులు చెరువులో స్నానానికి దిగి గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు బాలికలను స్థానికులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. మిగిలిన నలుగురు పిల్లలు మృతిచెందారు. వారి మృతదేహాలను వెలికితీశారు. గ్రామంలోని నలుగురు పిల్లలు మృతిచెందడంతో అక్కడంతా విషాదఛాయలు అలుముకున్నాయి. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాధిత కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి పరామర్శించారు.
Simply want to say your article is as astounding.
The clarity in your post is simply great and i could assume you are
an expert on this subject. Fine with your permission let
me to grab your RSS feed to keep updated with forthcoming post.
Thanks a million and please continue the gratifying work.