ఆటో ఢీకొన్న లారీ.. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు మృతి

సిద్దిపేట (CLiC2NEWS): జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. జిల్లాలోని జ‌గ‌దేవ‌పూర్ మండ‌లం అలిరాజ్‌పేట్ బ్రిడ్జి వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు మృతిచెందారు. ప్ర‌మాదంలో ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రు ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మ‌ర‌ణించారు. స‌మాచారం అంద‌కున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వారి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో వారిని గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా..మార్గ మ‌ధ్య‌మంలో ఇద్ద‌రు మ‌ర‌ణించారు. ప్ర‌మాద స‌మ‌యంలో ఆటోలో ఆరుగురు ప్ర‌యాణిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.