సెల్ఫీ తీసుకుంటూ న‌లుగురు యువ‌కులు మృతి..

రైల్వే వంతెన వ‌ద్ద సెల్ఫీ తీసుకుంటున్న న‌లుగురు యువ‌కులు ప్ర‌మాదానికి గురైనారు.

హ‌రియాణాలోని గురుగ్రామ్‌లో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన వ‌ద్ద మంగ‌ళ‌వారం రాత్రి సెల్ఫీ తీసుకుంటుండ‌గా .. రైలు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో వారు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌ర‌ణించిన వారంతా 18 నుండి 21 సంవ‌త్స‌ర‌ముల‌లోపు వార‌ని రైల్వే పోలీసులు తెలిపారు. వారిలో ఒక‌రు విద్యార్థి, మిగిలిన ముగ్గురు మొబైల్ షాప్‌లో ప‌నిచేస్తున్న‌ట్లు గుర్తించారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు ప్ర‌మాదాలుగా ప‌రిగ‌ణించ‌డంలేద‌ని రైల్వే ఉన్న‌తాధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.