ఎపి నుండి హైద‌రాబాద్‌కు రూ.2కోట్ల డ్ర‌గ్స్ ర‌వాణా..

హైద‌రాబాద్ (CLiC2NEWS):HY ఎపి నుండి హైద‌రాబాద్‌కు డ్ర‌గ్స్ ర‌వాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. తిరుప‌తి కి చెందిన కానిస్టేబుల్.. ఈ డ్ర‌గ్స్ ర‌వాణాలో ముఖ్య సూత్ర‌ధారిగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఎపి పోలీసు విభాగంలో కానిస్టుబుల్‌గా ప‌నిచేస్తున్న గుణ‌శేఖ‌ర్ మ‌రో ఐదుగురితో క‌లిసి ముఠాగా ఏర్ప‌డి అంత‌రాష్ట్ర డ్ర‌గ్స్ దందాకు పాల్ప‌డుతున్నాడు. బాప‌ట్ల జిల్లా అద్దంకి నుండి హైద‌రాబాద్‌లోని కూక‌ట్‌ప‌ల్లికి రూ.2 కోట్ల విలువైన 840 గ్రాముల కొకైన్‌, ఎఫిడ్రిన్ త‌ర‌లిస్తుండ‌గా.. సైబ‌రాబాద్ ఎస్ ఒటి పోలీసుల‌కు చిక్కారు. వారి వ‌ద్ద నుండి మాద‌క ద్ర‌వ్యాల‌తో పాటు ఐదు ఫోన్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. కూక‌ట్ ప‌ల్లి ప‌రిధి అల్విన్ కాల‌ని రోడ్డు హోట‌ల్ ద‌గ్గ‌రు విక్ర‌యించేందుకు వారంతా సిద్ద‌మ‌యిన‌ట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ మిన‌హా ఐదుగురిని పోలిస్టేష‌న్‌కు త‌ర‌లించారు. కానిస్టేబుల్ పరారీలో ఉన్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.