రైతన్న‌ల‌కు గుడ్‌న్యూస్: కేంద్ర కేబినేట్

ఢిల్లీ (CLiC2NEWS): కేంద్ర కేబినేట్ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గం బుధ‌వారం స‌మావేశ‌మైంది. రైతుల‌కు గోధుమ స‌హా 6 పంట‌ల‌కు ఎమ్ ఎస్‌పి పెంపుకు ఆమోదం తెలిపింది. రైతుల ఆదాయం పెంచే ల‌క్ష్యంగా పిఎం అన్న‌దాత ఆయ్ సంర‌క్ష‌ణ్ అభియాన్ (PM-AASHA) కు రూ. 35 వేల కోట్లు ఇచ్చేందుకు ఆమోద ముద్ర వేసింది. ర‌బీ పంట సీజ‌న్‌కు సంబంధించి నాన్‌-యూరియా ఎరువుల‌కు రూ. 24,475 కోట్ల స‌బ్సిడీ ఇవ్వ‌నుంది. 2025-26 మార్కెటింగ్ సీజ‌న్‌కు గాను ర‌బీ పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర (ఎమ్ఎస్‌పి)ను పెంచింది. క్వింటాల్ గోధుమ‌పై ఎమ్ఎస్‌పిని తాజాగా రూ. 150కి పెంచింది. దీంతో గతంలో ఉన్న క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర రూ.2275 ఉండ‌గా.. తాజా పెంపుతో రూ. 2425కి పెరిగింది.

Leave A Reply

Your email address will not be published.